దేవరకొండ పట్టణంలో ఘనంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట

కొండమల్లేపల్లి (జనంసాక్షి ): సెప్టెంబర్ 26 వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు ఉదయం నాలుగు గంటలకు అమ్మవారి విగ్రహాలకు అభిషేకం కార్యక్రమం మరియు ప్రతిష్టా విగ్రహంకు బస్టాండ్ ఎదురుగా వున్న కోదండరామాలయం నుండి పంచామృతములతో మరియు నవ ద్రవ్యములు మరియు కృష్ణాజలాలతో ఊరేగింపుగా శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం కు విచ్చేసి అమ్మవారికి ఎంతో ఘనంగా అభిషేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలంపల్లి నర్సింహ, నీలా పాండరయ్య, పానుగంటి మల్లయ్య, వాస్తవ వెంకటేశ్వర్లు రాచమల్ల వేంకటేశ్వర్లు గుద్దేటి జంగయ్య కొత్త సుబ్బారావు ఉప్పల శ్రీనివాసులు చీదెళ్ల వెంకటేశ్వర్లు నీలం సంజీవ కుమార్, కర్నాటి పురుషోత్తం, నీలా బుచ్చయ్య, నీలా రవి కుమార్, తదితరులు పాల్గొన్నారు