దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా

ఘనంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

నాగిరెడ్డి పెట్ 30 సెప్టెంబర్ జనం సాక్షి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట మండలం తాండూరు గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత మాల ధరించిన మాలాదారులు, స్వాములు గ్రామ ప్రజలు ,శివపార్వతుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు తరలివచ్చారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి మంగళహారతులతో తాండూర్ గ్రామంలో దుర్గామాత దేవి సన్నిధికి కుటు-ంబ సమేతంగా చేరుకున్నారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలతోపాటు తీర్థప్రసాదాలు అందించారు. శివపార్వతుల కళ్యాణం లో ధర్మాచార్య, అభిలాష్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత మాలదారులు, వారి కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు