దేశానికి కెసిఆర్ సేవలు ఎంతో అవసరం

జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి
బచ్చన్నపేట అక్టోబర్ 2 (జనం సాక్షి) తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని జనగామ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి అంజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని గోపాల్ నగర్ గ్రామపంచాయతీలో సర్పంచ్ పర్వతం మధు ప్రసాద్ తో కలిసి పెన్షన్ కార్డులను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ. వృద్ధాప్య పెన్షన్లు. ఒంటరి మహిళా పింఛన్లు. వికలాంగుల పెన్షన్లు. బీడీ మహిళకు పెన్షన్లు. కళ్యాణ లక్ష్మి. షాదీ ముబారక్. 24 గంటల కరెంటు ఉచితంగా. కెసిఆర్ కిట్టు. దళిత బంధు. రైతుబంధు ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేడని ఆమె తెలిపారు. అలాంటి ముఖ్యమంత్రి దేశ రాజకీయాలలో పాల్గొనడం మన అందరి అదృష్టం అని తెలిపారు