ధరణి సమస్యలు పరిష్కరించాలని జుక్కల్ లో బిజెపి ధర్నా

జుక్కల్, సెప్టెంబరు 28, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో బుదవారం బిజెపి నాయకులు మోకాళ్ళ పై నిలబడి ప్రభుత్వానికి నిరసన తెలిపారు. ధర్నా చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రంలో ధరణి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దరణిలో అవకతవకలవల్ల ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలు పరిష్కరించాలని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న బిజేపినేత కాటిపల్లి రమణారెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు.