నాపై విచారణ జరిపించండి

4A

 

4B

 

 

దోషిగా తేలితే శిక్షించండి

మాజీ మంత్రి రాజయ్య

హైదరాబాద్‌,జనవరి27(జనంసాక్షి): తానెలాంటి తప్పు చేయలేదని, తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి దోషిగా తేలితే శిక్షించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య కోరారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం రాజయ్య మీడియాతో మాటాడారు. తీవ్రమైన చాతినొప్పి రావడంతో రావడంతో రాజయ్యను ఈ సాయంత్రం  హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. రాజయ్యకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు బీపీ, పల్స్‌

రేటు పెరిగినట్లు గుర్తించారు.  రాజయ్యకు బీపీ, షుగర్‌ ఉన్నట్లు సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో ఆయన మనస్థాపం చెందినట్లు అనుచరులు చెబుతున్నారు. బర్తరఫ్‌ మాటవిని ఆవేదన చెందానని రాజయ్య చెప్పారు. తన పొరపాటు ఉంటే విచారణ జరిపించాలని అన్నారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. వైద్యులు అన్ని పరీక్షలు చేశారని చెప్పారు. వైద్యుల సహకారంతో ఇంటివద్దే ఉండి చికిత్స పొందుతానన్నారు.  రేపు మళ్లీ ఆస్పత్రికి వచ్చి పరీక్షలు చేయించుకుంటానని చెప్పారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని కోరారు.