నిజాంసాగర్ ప్రధాన కాలువకు గండి

nscg2609నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువకు గండి పడింది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అమర్ద్ గ్రామం వద్ద ఈ కాలువకు గండి పడడంతో సోయా, వరి పంటలు నీట మునిగాయి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్మూర్ శాసనసభ్యుడు జీవన్‌రెడ్డిలు కాలువకు గండి పడ్డ ప్రాంతాన్ని సందర్శించారు. గండి పూడ్చేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అలాగే పంట నష్ట పరిహారాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు. పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటామని పోచారం హామీ ఇచ్చారు.