నిజామాబాద్‌లో భారీ చోరీ

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. నగరంలోని హైమద్‌పురా కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో రాత్రి దుండగులు చోరీకి పాల్పడ్డారు. 73తులాల బంగారం, రూ.50వేల నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాల సాయంతో నిందితుల కోసం గాలింపు చేపట్టారు.