నీటి సదుపాయం కోసం జెడ్పిటిసి నిధులు మంజూరు

కేసముద్రం అక్టోబర్ 15 జనం సాక్షి /కేసముద్రం మండల కేంద్రంలోని ట్రైబల్‌ వెల్ఫేర్ పాఠశాలలో నీటి సదుపాయం కోసం బోర్ వేయడానికి జడ్పీటీసీ నిధుల నుండి 2,00,000 రూపాయలు మంజూరు చేయడము జరిగింది.శనివారం రోజున బోర్ నిర్మానం గురించి పరిసరాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వొలం చంద్రమోహన్ ,జడ్పీటీసీ రావుల శ్రీనాథ్ రెడ్డి,స్థానిక సర్పంచ్ బట్టు శ్రీను, ప్రిన్సిపాల్ ,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.