నూతనగా బాధ్యతలు చేపట్టిన కరెంట్ ఏ ఈ ని సన్మానించిన కేశబోయిన సుభాష్

పెద్దవంగర, అక్టోబర్ 13 (జనం సాక్షి )పెద్దవంగర మండల
వడ్డేకొత్తపల్లి సబ్ స్టేషన్ ఏఈ గా నూతన బాధ్యతలు స్వీకరించిన రమేష్ బాబు మరియు సబ్ ఇంజనీర్ మెట్రామ్ లను కేశబోయిన సుభాష్ చంద్రరాజు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ మరియు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సాదరంగా ఆహ్వానించారు, బాధ్యతలు స్వీకరించిన ఏఈ రమేష్ బాబు మాట్లాడుతూ ఇంతకుముందు తొర్రూర్ టౌన్ లో పనిచేసిన అనుభవం, అంతకంటే మించిన రెట్టింపు ఉత్సాహంతో ప్రజలందరికీ సౌకర్యవంతమైన కరెంటును అందించడానికి ప్రయత్నిస్తానని, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు,
ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ వీర సోములు, లైన్మెన్ కేశబోయిన భోజలు, బొల్లు ఊషయ్య తదితరులు ఉన్నారు.