నూతన పెన్షన్ డబ్బులు పంపిణీ చేసిన సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 07, (జనం సాక్షి ) : మండలంలోని తాటికొండలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మంజూరీ చేసిన నూతన ఆసరా పెన్షన్ కార్డుల నగదు డబ్బులను గ్రామసర్పంచ్ చల్లా ఉమసుధీ ర్ రెడ్డి  పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ సందర్భం గా సర్పంచ్ ఉమాసుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందుకువెళ్లడంజరుగుతుం దని అన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహ కారం ఉండాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మారపాక రాములు, వార్డు సభ్యులు ఉమ్మగోని రమ రాజు, మారపాక పద్మ  నాగరాజు, దామేర ఉపేంద్ర  ఎల్లయ్య, కో- ఆప్షన్ మెంబెర్ బేతి మంజుల, పంచాయతీ కార్యదర్శి జెల్లెళ్ళ శేఖర్ , గ్రామ కారోబార్ ఎండీ సలీం, గ్రామ సిబ్బం ది, ఆసరా పెన్షన్ పంపిణీ లబ్ధిదారులు తదితరు లు పాల్గొన్నారు.