నెహ్రూ చౌరస్తా వద్ద వివేకానంద విగ్రహాం ఆవిష్కరణ

తెలకపల్లి: స్వామి వివేకానంద విగ్రహాన్ని తెలకపల్లిలోని నెహ్రూ చౌరస్తా వద్ద స్థానిక ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు. చిన్న వయసులోనే తన వాక్చాతుర్యంతో అందరి మనసులు గెలుచుకున్న మహోన్నత వక్తని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ ఛైర్మన్‌ కె.దామోదర్‌ రెడ్డి, వివిధ పార్టీల స్థానిక వివేకానంద యువత సమితి సభ్యులు పాల్గొన్నారు.