పదో తరగతి పూర్వ  విద్యార్థుల దాతృత్వం పాఠశాలకు అట వస్తువుల అందజేత 

వీణవంక డిసెంబర్ 13 (జనం సాక్షి)వీణవంక మండలం కేంద్రంలో జడ్పీ హైస్కూల్ నందు పదో తరగతి  1995-96 సంవత్సరానికి సంబంధించిన పూర్వ విద్యార్థులు గత నెలలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది అందులో వీణవంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  చదువుతున్న విద్యార్థులకు స్పోర్ట్స్ మెటీరియల్ లేదని తెలుసుకొని ఈరోజు వీణవంక ప్రభుత్వ  హై స్కూల్ కు స్పోర్ట్స్ మెటీరియల్ అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి  జెడ్ పి హెచ్ ఎస్  హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి అధ్యక్షత వహించగా ఎం ఈ ఓ  శ్రీనివాస్  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులను ఈ విధంగా ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉంది స్పోర్ట్స్ మెటీరియల్ వల్ల వీణవంక హైస్కూల్లో చదువుతున్న పిల్లలు వాటివల్ల క్రమశిక్షణతోని క్రీడలు నేర్చుకుని మండల స్థాయి జిల్లా స్థాయి ఆటల పోటీలలో పాల్గొని వీణవంక పాఠశాలకు పేరు తెచ్చే విధంగా నడుచుకోవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో వీణవంక ఉపసర్పంచ్  ఒరేం భాను చందర్,మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్,పూర్వ విద్యార్థులు కర్ర కుమార్ రెడ్డి, తాటి పాముల శ్రీనివాస్, అల్లెంకి శ్రీనివాస్, కొండల్ రెడ్డి, స్థానిక ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు