పాఠశాలల బంద్ విజయవంతం చేద్దాం.

ఏబీవీపీ తాండూరు శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేత.
తాండూరు జులై 4(జనంసాక్షి)సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ తీరును నిరసిస్తూ జులై 5న  తెలంగాణ పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ప్రైవేట్ స్కూల్ సంఘానికి వినతి పత్రం అందజేశారు  ఏబీవీపీ తాండూరు నగర కార్యదర్శి మని కొండల్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సర్కారు స్కూళ్లను నిర్లక్ష్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల అఘాడాలను ప్రోత్సహిస్తున్న తెరాస ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ  జులై 5న తెలంగాణ పాఠశాలల బంద్ నిర్వహించనున్నట్లు తెలిపారు  మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని, మౌలిక వసతులు కల్పిస్తామని అట్టహసంగా ప్రకటించిన ప్రభుత్వం  విద్యాసంవత్సరం ప్రారంభమైనా కనీసం పాఠ్య పుస్తకాలు, స్కూల్ డ్రెస్ లు పంపిణీ చేయకపోవడం,నిధులు విడుదల చేయకపోవడంతో మౌలిక వసతుల కల్పనలో,మధ్యాహ్న భోజనం అందించడంలో  ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఫీజు  దోపిడీ నియంత్రించి ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తామని స్వయంగా విద్యా శాఖ మంత్రి జనవరిలో ప్రకటించినా ప్రభుత్వం ఆ దిశగా  అడుగులు వేయకపోవడం,ఫీజుల నియంత్రణకై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు డొనేషన్, బుక్స్, స్కూల్ డ్రెస్ పేరుతో బహిరంగంగా లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలను హింసిస్తూ పలు పాఠశాలలు ప్రవేశం రోజు 60% ఫీజు చెల్లిస్తేనే తరగతి అనుమతిస్తామని షరతులు పెడుతున్నా  ప్రభుత్వం నిమ్మకునీరేత్తినట్లు వ్యవహారిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు ప్రభుత్వం కొమ్ము కాస్తుందని మండిపడ్డారు.గత ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం సర్కారు బడులను నిర్లక్ష్యం చేస్తూ నియామకాలు చేపట్టకుండా, నిధులు విడుదల చేయకుండా, మౌలిక వసతులు కల్పించకుండా పాఠశాల విద్యను నిర్వీర్యం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ఒక వైపు చేస్తూ మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు  ప్రోత్సహిస్తూ అనుమతి లేకపోయినా,ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగిస్తూ ఒకే పేరుతో వందల బ్రాంచ్ లు నిర్వహించినా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ బహిరంగ దోపిడీకి పాల్పడిన విద్యా శాఖ అధికారుల నియంత్రణ మాత్రం శూన్యంమన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు నవీన్ , పవన్ తదితరులు పాల్గొన్నారు.