పాఠశాల ఆకస్మిక తనిఖీ

సదాశివపేట్; మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దాపూర్ మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందికంది పాఠశాలను సిఆర్పి రాజేశ్వర్ ఆకస్మికంగా సందర్శించారు. పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించి ఈనెల 23 నుండి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 100/ ఉత్తీర్ణత సాధించాలని ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నాగభూషణం ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.