పామును తప్పించబోయి ప్రాణాలమీదకు..

మహబూబ్‌నగర్(గోపాలపేట): పామును తప్పించబోయి ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడో వ్యక్తి. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి డిగ్రీ కళశాల సమీపంలో మంగళవారం ఉదయం ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడి వ్యక్తి తలకు బలమైన గాయాలయ్యాయి. గోపాలపేట మండలం చీర్కపల్లి గ్రామంలో మంగళవారం జరగబోయే ‘పల్లె వికాసం’ కార్యక్రమానికి వెళ్తున్న ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వెంకటేష్ ద్విచక్ర వాహనంపై నుంచి కింద పడ్డారు. వనపర్తి డిగ్రీ కాలేజి దగ్గర్లో ఆయన వాహనానికి పాము ఆడ్డు రావడంతో దాన్ని తప్పించడానికి ప్రయత్నించటంతో ఈ సంఘటన జరిగింది. దీంతో ఆయన తలకు బలమైన గాయం అయింది. వెంటనే  వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.