పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం

సైదాపూర్ జనం సాక్షి అక్టోబర్ 2(లస్మన్నపల్లి) మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో గాంధీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటుచేసిన ప్రత్యేక గ్రామసభలో పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేయడంతోపాటు శానిటేషన్ కిట్టును అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు మాట్లాడుతూ ..పారిశుద్ధ కార్మికులు గ్రామంలో పారిశుద్యాన్ని తొలగించడంతోపాటు గ్రామం పరిశుభ్రంగా ఉండేందుకు ఎన్నో రకాల శ్రమ పడుతున్నారని అన్నారు. వారి వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మ్యాకల మల్లారెడ్డి, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, వార్డు సభ్యులు రేగుల సురేష్, కోఆప్షన్ సభ్యులు కొట్టే వెంకట్ రెడ్డి, వివోఏ శ్రీలత, ఆశ వర్కర్ నిర్మల, గ్రామస్తులు పాల్సాని అనిల్ రెడ్డి,కొట్టే రాజు,జాల రాజు,గుర్రాల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.