పాలమూరులో నటి అనూ సందడి

మహబూబ్‌నగర్‌,మే5(జ‌నం సాక్షి):  ప్రముఖ సినీనటి అను ఇమ్మాన్యుయేల్‌ శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో సందడి చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ బ్రాండ్‌ మొబైల్‌ స్టోర్‌ను ఆమె ప్రారంభించారు. వినూత్నమైన మొబైల్‌ని ఉపయోగిస్తున్నామనే అనుభూతిని వినియోగదారులకు కల్పించే విధంగా హ్యాపీ మొబైళ్లు ఉంటాయని ఎండీ కృష్ణపవన్‌ అన్నారు. సేల్స్‌, పైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ ఎల్లప్పుడూ స్టోర్స్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌తో పాటు కర్ణాటకలోనూ హ్యాపీ మొబైల్‌ స్టోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా పలు ఆఫర్లను ఆయన ప్రకటించారు.