పాలమూరులో బాలికపై అత్యాచారం

మహబూబ్‌నగర్‌: ప్రభుత్వాల బెదిరింపులకు మృగాళ్లు లొంగడం లేదు. ఈ ప్రభుత్వాలు మనల్నేం చేయగలవు అనుకుంటూ రెచ్చిపోతూనే ఉన్నారు. అమాయక మహిళలను కాటేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాల ఉదాసీన వైఖరి కారణంగా ఇటువంటి ఘటనలు రోజూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ మండలం అజిలాపూర్‌ సమీపంలో 13ఏళ్ల చెంచు బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.