పాల్వంచ కేటీపీఎస్‌ ఆవరణలో ధర్నా

ఖమ్మం: రాష్ట్రంలోని జెన్‌కో విద్యుత్‌ ప్రాజెక్టులకు నాణ్యమైన బొగ్గును అందించాలని, ఉద్యోగ, కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పాల్వంచ అంబేద్కర్‌ సెంటర్‌లో కార్మికులు ధర్నా నిర్వహించారు.నాణ్యమైన బొగ్గును సరఫరా చేయడంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో మెరుగైన విద్యుదుత్పత్తి అందించలేకపోతున్నామని సంఘం రాష్ట్ర  ప్రధాని కార్యదర్శి దుర్గా అశోక్‌ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేటీపీఎస్‌ ప్రాంతీయ అధ్యక్ష, కార్యదర్శులు పరమేష్‌, చెరుకు అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.