పిచ్చికుక్క స్వైర విహారం, 16 మందికి గాయాలు

మహాబూబ్‌నగర్‌ : జిల్లాలోని వనపర్తిలో ఉదయం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. బస్టాండ్‌లో వేచివున్న ప్రయాణికులపై దాడి చేసింది. ఈ దాడిలో 16 మంది గాయపడ్డారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.