పిచ్చి ప్రేలాపనలు మాను రుజువులుంటే పట్టుకురా..
చీకట్లో వైఎస్ను కలవలేదు
రఘునందన్పై హరీశ్ ఫైర్
హైదరాబాద్, మే 15 (జనంసాక్షి) :
పిచ్చిప్రేలాపనలు మానుకో.. రుజువు లుంటే పట్టుకురా అని టీఆర్ఎస్ బహిష్కృత నేత రఘునందన్రావుపై టీఆర్్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్రావు విరుచుకుపడ్డారు. పార్టీ కార్యక్రమాలకు భిన్నంగా వ్యవహరిస్తూ పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన రఘునందన్రావు చేసిన ఏఒక్క ఆరోపణనైనా నిరూపించాలని టీఆర్ఎస్ నేత హరీశ్రావు డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన విూడియాతో మాట్లాడుతూ రఘునందన్రావు పార్టీనుంచి దూరం అవుతున్నందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. జీవితంలో అశోక ¬టల్ ఎక్కడుందో కూడా తనకు తెలియదన్నారు. తిరుపతిలో ఆనాడు రఘునందన్రావు చేతిలోన్ క్రింద అయిదువేలో పదివేలో ఇస్తే ఇచ్చి ఉండొచ్చని, తాను అసలు మరిచిపోయానన్నారు. అవి ఏమన్నా టిక్కెట్కోసం లంచంగా తీసుకున్నానా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రస్టేష్రన్లో ఉన్న రఘునందన్రావు ఏదేదో పిచ్చిపిచ్చి వ్యాఖ్యలుచేస్తున్నాడని ఆరోపించారు. ఆయన చేసిన ఏఆరోపణనైనా నిరూపించాలని, ఎంతటి శిక్షకైనా తాను సిద్దంగా ఉంటానన్నారు. కేసిఆర్ వద్ద తాను నేర్చుకున్నది నైతిక విలువలకు కట్టుబడి ఉండడమేనన్నారు. రఘునందన్రావు చేసిన ప్రతివ్యాఖ్యను తాను వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఖండిస్తున్నానన్నారు. కేసిఆర్కు తనకు మధ్య చిచ్చు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలే అవి అన్నారు. ఇలా తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసేందుకే ఆయనను ఎవరో ప్రోద్బలం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా పార్టీపైన, తనపైన పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేయడం మానుకోక పోతే సరైనరీతిలో గుణపాఠం చెప్పుతామన్నారు.