ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు ఆపడం లేదు

` రాష్ట్రాన్ని వెన్నాడుతున్న కేసీఆర్‌ పాలనా వైఫల్యాలు
` ఏపీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు
` వ్యవసాయారంగాన్ని అభివృద్ది చేయడం కాంగ్రెస్‌ లక్ష్యం
` పాలేర్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని విడుదల చేసిన భట్టి,పొంగులేటి
ఖమ్మం(జనంసాక్షి): కేసీఆర్‌ పాలనలో చేసిన తప్పిదాలకు నేడు తమ ప్రభుత్వం మూల్యం చెల్లిస్తోందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గతంలో శ్రీశైలంపైన ఏపీ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు కడుతుంటే అడ్డుకోకుండా కేసీఆర్‌ ప్రభుత్వం సహకరించిందని మండిపడ్డారు. ఆనాడు కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ఆనాడు కేసీఆర్‌, హరీష్‌రావు, కేటీ-ఆర్‌ తప్పులు చేసి వాటిని ఇప్పుడు తమపై రుద్దాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని అన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ది చేసి కాపాడుకుంటామని భట్టి విక్రమార్క ఉద్ఘాటించారు. కాంగ్రెస్‌ అంటేనే వ్యవసాయం, కరెంట్‌, ప్రాజెక్ట్‌లు అని అభివర్ణించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయం, రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. సోమవారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్‌ నుంచి సాగర్‌ నీటిని డిప్యూటీ- సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి విడుదల చేశారు. జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు పాలేరు రిజర్వాయర్‌ నుంచి 1500 క్యూసెక్కుల సాగు నీటిని రెండో జోనుకు మంత్రులు విడుదల చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క విూడియాతో మాట్లాడారు. ఇవాళ సాగర్‌ రెండో జోన్‌కు సాగునీరు విడుదల చేశామని తెలిపారు.గత కేసీఆర్‌ ప్రభుత్వ నిర్ణయాలు తెలంగాణ రాష్టాన్రికి భారంగా మారాయని ఆరోపించారు. రైతులు పండిరచిన పంటకు పెట్టు-బడిగా రైతు భరోసా, రూ.9 వేల కోట్లు- ఇచ్చామని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వంలో సన్నవడ్లకు బోనస్‌ ఇచ్చామని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని భట్టి విక్రమార్కమండిపడ్డారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటేనే.. వ్యవసాయం, కరెంటు-, ప్రాజెక్టులు అని అన్నారు. ఎపి ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే..మాజీ సిఎం కెసిఆర్‌ పట్టించుకోలేదని విమర్శించారు. ఆనాడు తప్పిదాలు చేసిందంటే కెసిఆర్‌, బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌, మాజీ మంత్రి హరీష్‌ రావు అని తెలియజేశారు. తప్పులు చేసిన బిఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు తమపై దుష్పచ్రారం చేస్తున్నారని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన ప్రతి హావిూని నిలబెట్టు-కుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. 2,55,324 లక్షల ఎకరాలకు సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. గత ఏడాది కనీవినీ ఎరుగని వరదల కారణంగా సాగర్‌ మెయిన్‌ కెనాల్‌ పూర్తిగా కొట్టు-కుపోయిందని.. దానిని పునరుద్ధరించామని తెలిపారు. నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు పూర్తి స్దాయిలో సాగునీరు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కృష్ణా బేసిన్‌లో వచ్చే నీటితో మొదటి పంటకు ఎలాంటి ఢోకా లేదని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వరుణ దేవుడి అండ ఉందని.. ఇది శుభసూచకమని అన్నారు. గత కేసీఆర్‌ ప్రభుత్వం రాష్టాన్న్రి అప్పుల కుప్పచేసినా.. తమ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలబడ్డామని నొక్కిచెప్పారు. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు అన్నదాతల ఖాతాలో వేశామని స్పష్టం చేశారు. రైతును రాజు చేయాలన్నదే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్‌యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. ప్రస్తుతం 400 క్యూసెక్కుల నీరు విడుదల చేశామని అన్నారు. రాబోయే 5 రోజుల్లో పూర్తిస్థాయి ఆయకట్టుకు నీరువిడుదల చేస్తామని తెలియజేశారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా రైతు పథకాలు అమలు చేస్తున్నామని, రైతుభరోసా రైతులకు ఎకరాలకు రూ.12 వేలు అందించామని, రైతుల ఖాతాల్లో 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు- జమ చేశామని చెప్పారు. సన్న ధాన్యానికి క్వింటాళ్లకు రూ. 500 బోనస్‌ ఇస్తున్నామని, రాబోయే రోజుల్లో మిగిలిన పంటలకు కూడా బోనస్‌ ఇస్తామని పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి పేర్కొన్నారు.