కేరళ నర్సుకేసులో చేతులెత్తేసిన కేంద్రం
` నిమిష ప్రియ ఉరిశిక్ష ఆపేందుకు చేయగలిగిందేమీ లేదు
` సుప్రీంకు వివరించిన కేంద్ర ప్రభుత్వం
` ‘బ్లడ్మనీ’ఆప్షన్ పైనే ఆశలు పెట్టుకున్న కుటుంబం
న్యూఢల్లీి(జనంసాక్షి): కేరళకు చెందిన నర్స్ నిమిష ప్రియకు యెమెన్లో పడిన మరణశిక్ష విషయంలో అన్ని దారులు మూసుకుపోయాయని కేంద్రం సుప్రీంకు తెలియచేసింది. ఉరిశిక్ష అమలుకు ఇంకా రెండురోజుల సమయమే ఉన్నందున, ఆ శిక్షను ఆపేందుకు ఇప్పుడు భారత్ వద్ద పెద్దగా మార్గాలేవిూ లేవని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక మిగిలింది బ్లడ్ మనీ ఆప్షనే. అయితే అది ప్రైవేటు- సంప్రదింపు అని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. హూతీల పాలనలో ఉన్న యెమెన్ చట్టాల ప్రకారం.. నేరం రుజువైన తర్వాత కూడా దోషిని బాధిత కుటుంబం క్షమిస్తే శిక్ష తప్పుతుంది. ఆ కుటుంబం బ్లడ్మనీకి అంగీకరిస్తే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో నిమిష కుటుంబం.. బాధిత కుటుంబంతో సంప్రదింపులు కొనసాగిస్తోందని ’ది సేవ్ నిమిషప్రియ ఆర్గనైజేషన్’ సుప్రీంకోర్టుకు వెల్లడిరచింది. చెప్పుకోదగ్గ స్థాయిలో ధనాన్ని సేకరించింది. అయితే ఈ విషయంపై చర్చించేందుకు ఆ కుటుంబం, హూతీ యంత్రాంగం నిరాకరిస్తోంది. ఈ వ్యవహారం తమ గౌరవానికి సంబంధించినదిగా వారు చెప్తున్నారు. ఆ మొత్తం పెరిగితే.. వారి అభిప్రాయం మారుతుందో లేదో తెలియదు. ఇప్పటికైతే ఆ చర్చలు నిలిచిపోయాయని అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోర్టులో వెల్లడిరచారు. జులై 16న యెమెన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషను కాపాడేందుకు భారత ప్రభుత్వం వద్ద ఉన్న అవకాశాలు అతితక్కువని కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ సుప్రీం ధర్మాసనానికి నివేదించారు. ప్రియ ఉరిశిక్ష ఉత్తర్వును నిలిపివేయడానికి భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. అయితే, బ్లడ్ మనీ సెటిల్మెంట్ మాత్రమే నిమిషను కాపాడగలిగే ఏకైక మార్గం అని ఏజీఐ వెంకటరమణి సుప్రీంకోర్టుకు తెలియజేశారు. నిమిష ప్రియను ఉరిశిక్ష నుంచి దౌత్యపరమైన చర్చల ద్వారా రక్షించేలా భారత ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ.. ఆమె తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో 10వ తేదీన అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. కేంద్రం తరపున భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తన వాదనలు వినిపించారు. జులై 16న కేరళ నర్సు
మరణశిక్షను ఆపేందుకు లేదా వాయిదా వేయించేందుకు భారత ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న అవకాశాలు అతి తక్కువని తెలిపారు. భారత్-యెమెన్ల మధ్య దౌత్యపరంగా సత్సంబంధాలు లేకపోవడమూ ఒక కారణమని అన్నారు. నిమిష తరపు న్యాయవాది వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. కేసు స్థితి గురించి ఇరువర్గాల తదుపరి విచారణలో కోర్టుకు తెలియజేయవచ్చని బెంచ్ తన ఉత్తర్వులో పేర్కొంది. ఈ సందర్భంగా జస్టిస్ సందీప్ మెహతా తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఈ లోగా ఆమె ప్రాణాలు కోల్పోతే అది అత్యంత విచారకరమని అన్నారు. అయితే, ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిమిషను ప్రధాని కాపాడాలని కోరుతూ విదేశాంగశాఖ మంత్రి జై జైశంకర్కు లేఖ రాశారు. కేరళకు చెందిన నిమిష ప్రియ నర్సు కోర్సు పూర్తి చేసి 2008లో యెమెన్లో ఉద్యోగంలో చేరింది. 2011లో ఆమెకు థామస్ అనే వ్యక్తితో వివాహమైంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి క్లినిక్ తెరవాలనుకున్నారు. యెమెన్లో ఇతర దేశస్థులు సొంతంగా వ్యాపారం చేయడం కుదరదు. అందుకని స్థానికుడైన తలాల్ అదిబ్ మెహదితో కలిసి అల్అమన్ మెడికల్ కౌన్సిల్ సెంటర్ను మొదలుపెట్టారు. అయితే, 2014లో నిమిష భర్త, కూతురు ఆర్థిక కారణాల కారణంగా ఇండియాకు తిరిగొచ్చేశారు. నిమిష మాత్రం యెమెన్ అంతర్యుద్ధంలో చిక్కుకుని ఇంటికి తిరిగిరాలేక పోయింది. ఆ తర్వాత నుంచి మెహది ఆమె పాస్ పోర్టు, డబ్బు లాక్కుని చిత్రహింసలకు గురిచేశాడు. దీంతో 2016లో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా ఫలితం దక్కకపోవడంతో.. 2017లో ఓ రోజున తన పాస్పోర్టు తీసుకునేందుకు మెహదీకి మత్తుమందు ఇచ్చింది. దురదృష్టవశాత్తూ డోసు ఎక్కువై మెహదీ చనిపోవడంతో అతడి మృతదేహాన్ని వాటర్ ట్యాంకులో పడేసి సౌదీకి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పోలీసులకు పట్టు-బడిరది. గత ఏడాది నిమిష తల్లి ప్రేమకుమారి యెమెన్ వెళ్లారు. తనకున్న పరిచయాల ఆధారంగా బ్లడ్మనీ ఇచ్చి, తన కుమార్తెను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేశారు. ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు (రూ.8.6 కోట్లు)ను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది. దీనిపై అటువైపు నుంచి స్పందన రాలేదని బాబుజాన్ అనే యాక్టివిస్ట్ ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడిరచారు.