పిట్టల కుమారస్వామిని సన్మానించిన ముదిరాజ్ యూత్ సభ్యులు

స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 09, ( జనం సాక్షి ) :
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక స్టేషన్ ఘన పూర్ మండల గౌరవ అధ్యక్షులుగా నియామకం అయిన పిట్టల కుమారస్వామి ముదిరాజ్ ని ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.స్టేషన్ ఘన పూర్ డివిజన్ కేంద్రంలోని శివునిపల్లి పెద్దమ్మతల్లి దేవాలయంలో ముదిరాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు గోరంట్ల యాదగిరి ముదిరాజ్ అధ్యక్ష తన సమావేశంనిర్వహించడం జరిగింది.ఈ సమా వేశంలో గోరంట్ల యాదగిరి మాట్లాడుతూ ముది రాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటి సహాయకార్యదర్శిగా పని చేస్తున్న పిట్టల కుమారస్వామి ముదిరాజ్  వికలాంగుల హక్కుల జాతీయ వేదిక స్టేషన్ ఘన పూర్ మండల గౌరవ అధ్యక్షులుగా నియమకం కావడం చాలా సంతోషించతగిన విషయం అని, పిట్టల కుమారస్వామీ ముదిరాజ్ ఇలానే మండల స్థాయి నుండి జిల్లాకు అలాగే రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళి వికలాంగుల శ్రేయస్సు కొరకు  తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ అందరి మన్నన లను పొందాలని దానికి ముదిరాజ్ కుల దైవం  పెద్దమ్మతల్లి ఆశిస్సులు ఎల్లావేళలా తనపై ఉండా లని,అలాగే ఎలాంటి సహాయ సహకారాలు కావా లన్న యూత్ తరపున అందించడానికి ముందు  ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ముది రాజ్ యూత్ వెల్ఫేర్ సొసైటి ఉపాధ్యక్షులు సాంబ రాజు,ప్రధాన కార్యదర్శి సురేష్,కోశాధికారి అనిల్,
ఆర్గనైజర్ రమేష్, సభ్యులు శివలింగం, రాకేష్, సిద్దు, తిరుపతి,నాగరాజు,రాజ శేఖర్, శ్రీకాంత్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.