పూడూరులో పసిడి విగ్రహాల కలకలం

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: గద్వాలలో బంగారు విగ్రహాలు కలకలం సృష్టించాయి. మూడేళ్ల క్రితం పూడూరులో ఓ రైతుకు బంగారు విగ్రహాలు దొరికినట్లు సమాచారం. అతను విగ్రహాలను స్థానిక వ్యాపారికి వారం క్రితం అమ్మేందుకు యత్నించాడు. అయితే డబ్బు లేదని పంపి వ్యాపారి పోలీసులకు సమాచారమందించాడు. పలు విగ్రహాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయలేదని పోలీసులపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గద్వాల ఆర్డీవో నారాయణరెడ్డిని కలెక్టర్‌ గిరిజా శంకర్‌ వివరణ కోరారు.