పూర్వ విద్యార్థుల భేటీ

మహబూబ్‌నగర్‌,మే28( జ‌నం సాక్షి ):  మద్దూర్‌ మండలం భూనీడ్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో   2005-06 బ్యాచ్‌ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం  ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తమ గురువులను పిలిపించి ఘనంగా సన్మానించారు…చాలా కాలం తర్వాత ఇలాంటి కార్యక్రమంలో కలుసుకోవడం మా అదృష్టం అని పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.. కార్యక్రమంలో కృష్ణా రెడ్డి,పురుషోత్తం, గోపాల్‌ గౌడ్‌,శ్రీనివాస్‌ గౌడ్‌,రవీందర్‌ రెడ్డి,బాల్‌ రెడ్డి,రఫీ,నిలయ్య గౌడ్‌,బాబు,పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.