పూలే విగ్రహావిష్కరణ

భువనగిరి,మే8(జ‌నం సాక్షి):  భువనగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతీరావుపూలే విగ్రహాన్ని బీసీ సంక్షేమశాఖా మంత్రి జోగిరామన్న మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ పక్కన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైలా శేఖర్‌రెడ్డి, పుర అధ్యక్షురాలు లావణ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. విగ్రహావిష్కరణ అనంతనం పూలే విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.