పేద విద్యార్థుల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం :ఎంపీపీ ఎల్లుభాయిబాబు

తెలంగాణ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుందని శామీర్ పేట్ ఎంపీపీ ఎల్లు భాయి బాబు అన్నారు. మంగళ వారంరోజు శామీర్ పేట్ మండలంలో గల ఎంఈఓ కార్యాలయంలో ప్రభుత్వ పాఠ శాలలకు పిల్లలు చదువుకునే బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంపిపి దాసరి ఎల్లుబాయిబాబు ప్రారంభించారు .విద్యార్థులు ప్రతి ఒక్కరూ శ్రద్ధగా చదువు కోవాలి.నేటి బాలలే రేపటి పౌరులు.
అలాగే ఉపాధ్యాయులు పాఠశాల యొక్క సమయ పాలన పాటించాలని ఎంపీపీ అన్నారు.ఈ కార్యక్రమంలో  ఎంఈఓ వసంత కుమారి, టీచర్లు, స్కూల్ ఇంఛార్జ్ లు,సిబ్బంది పాల్గొన్నారు.
28 ఎస్పీటీ -1: పుస్తకాలు పంపిణి చేస్తున్న ఎంపీపీ