ప్రకాశం పంతులుకు సిఎం జగన్‌ నివాళి


అమరావతి,ఆగస్ట్‌23(జనంసాక్షి): తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని సిఎం జగన్‌ కొనియాడారు. టంగుటూరి ప్రకాశం పంతులు 150 వ జయంతి సందర్భంగా… ఆయనకు ముఖ్యమంత్రి జగన్‌ ఘన నివాళులర్పించారు. ట్విట్టర్‌ వేదికగా సిఎం జగన్‌ స్పందిస్తూ… ‘తెలుగువారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ప్రముఖ స్వాతంత్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 150 వ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి‘ అని పేర్కొన్నారు.