ప్రజాప్రయోజనాలకు బ్యాంకుల దోహదం

బాలానగర్‌: ఆర్థిక పరమైన ప్రజాప్రయోజనాలకు బ్యాంకులు దోహదపడతాయని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ జనరల్‌ మేనేజర్‌ వెంకరామన్‌ అన్నారు. గురువారం బాలానగర్‌ మండలం ఉడిత్యాల గ్రామంలో ఎన్‌బీహచ్‌ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1947 నుంచి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎన్‌బీహెచ్‌ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 1001 శాఖలు ఉండగా జిల్లాలో 52 శాఖను ఉడిత్యాలలో ప్రారంభించినట్లు తెలిపారు.