ప్రభుత్వ ఉద్యోగులకు ఆసరా పెన్షన్..?

కామారెడ్డి ప్రతినిధి అక్టోబర్ 2 జనం సాక్షి:
కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్ రావడంతో అసలైన నిరుపేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు చేతివాటం తో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి సైతం పెన్షన్ రావడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన తర్వాత పెన్షన్లు పంపిణీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పై ఉంది.