ప్రాణం తిసిన సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌

దౌల్తాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా దౌల్లాబాద్‌ మండలంలోని చంద్రకళ గ్రామంలో సెల్‌ఫోన్‌ ఛార్జీంగ్‌ పెడుతూ ఓ మహిళ మృతి చెందింది. అరుణ (35) అనే మహిళ సెల్‌ఫోన్‌కు ఛార్జీంగ్‌ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై కిందపడింది. ఆమె తలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కొడంగల్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.