బక్రీద్ పండుగ సందర్భంగా ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చాలి.

తాండూరు జులై 6(జనంసాక్షి)బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చాలని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి బుధవారం  చెంగేష్ పూర్ రోడ్డులోని ఈద్గాను సందర్శించి పరిశలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈద్గా ప్రార్థన స్థలంలో  ప్రార్థనలకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అప్పు నయిం, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ , మతపెద్దలు తదితరులు ఉన్నారు.