బదిలీ పై వెళ్తున్న సబ్ స్టేషన్ అపరేటర్స్ ను సాన్మనించిన గ్రామస్తులు

ఎల్లారెడ్డి 27 సెప్టెంబర్ జనం సాక్షి  ఎల్లారెడ్డి మండలం లోని గండి మాసాని పెట్  విద్యుత్ సబ్ స్టేషన్ లో పని చేస్తున్న  అపరేటేర్స్ లింగం. రవి కుమార్ లు  ఇటీవల బదిలీ ఐనట్లు తెలుసుకున్న గ్రామస్తులు మంగ్లవారం  వారిని  స్థానిక గ్రామ పంచాయతీ అవరన లో  బి సి విద్యుత్  సెక్రెటరీ దివిటీ సురేందర్ ఆధ్వర్యంలో  ఎల్లారెడ్డి పురపాలక  వైస్ చేర్ పర్సన్ కుమారుడు శ్రవణ్ కుమార్ పటేల్  పూలమాల వేసి శాలువా తో సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గండి మాసాని పెట్.          సబ్ స్టేషన్ లో ఆపరేటర్స్  లింగం. రవి కుమార్   గత 12 ఏళ్లు గా ఆపరేటర్స్ గా ఉంటూ గ్రామం లో విద్యుత్  అంతరాయం లేకుండా గ్రామస్తులకు మరియు రైతులకు అన్ని వేళల్లో అందు బాటులో  వుంటూ మంచి పేరు తెచ్చుకున్న ఆపరేటర్స్  ను అభినందించారు గ్రామస్తులతో కలిసి మెలసి ప్రతి ఒక్కరి మనసులో చోటు సంపాదించుకున్న  లింగం. రవి కుమార్  ల సేవ ను మర్చిపోలేమని అన్నారు అనంతరం  ట్రాన్స్ కో  ఏఈ సత్యనారాయణ గౌడ్ మాట్లాతు మంచి ఆపరేటర్స్  సబ్ స్టేషన్ నుండి బదిలీ పై వెళ్తునందుకు బాధగా వున్నా తప్పదు ఎక్కడు వున్న ఉద్యోగ బాద్యాతలు  తప్పవని వారికి వీడ్కోలు పలికారు ఈ కార్యక్రమమం లో బి సి విద్యుత్ సేక్రెట్టి దివిటీ సురేందర్  మరియు  జూనియర్ లైన్ మెన్ నాగరాజు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు