బహిరంగ సభకు భారీగా తరలివెళ్ళిన బిజెపి శ్రేణులు

హత్నూర (జనం సాక్షి)
టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు,నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ బిజెపిలో చేరుతున్న నేపథ్యంలో ఆదివారం నర్సాపూర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హత్నూర మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన బిజెపీ శ్రేణులు భారీ సంఖ్యలో బయలుదేరి వెళ్లారు.కాసాల బిఎన్ రెడ్డి ఫంక్షన్ హాల్ నుంచి దౌల్తాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు యువత పలు నినాదాలు చేస్తూ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బైక్ ర్యాలీగా నర్సాపూర్ తరలి వెళ్లారు.కార్యక్రమంలో కృష్ణాగౌడ్,సురేష్,మధు,మహేష్,కృష్ణ యాదవ్,గొంగులు తదితరులు ఉన్నారు.
Attachments area