బాధిత కుటుంబానికి బియ్యం అందించిన కాంగ్రెస్ నాయకులు

జనం సాక్షి, చెన్నరావు పేట

మండలంలోని జల్లి గ్రామానికి చెందిన మంచాల సుధాకర్, మంచాల మధు ల తల్లి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఏఐసీసీ సభ్యులు, మాజీ శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు వారి కుటుంబానికి క్వింటా బియ్యాన్ని అందించిన జల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాలు నాయక్. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల బీసీ సెల్ ఉపాధక్షులు అంబాల రవి, నర్సంపేట నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధక్షులు రూపిక శ్రావణ్ కుమార్,బోడ వీరభద్రు,గాదె కర్ణాకర్,బోడ కిషన్,బెల్లి రాజు,చిట్టిబాబు, బోడ సుమన్,భూక్య సంతోష్, కొర్ర బద్రు, సూదురు చెంద్రారెడ్డి, ఇరుకుల శ్రీను, అంగోత్ శ్రీపాల్ తదితరులు పాల్గొన్నారు.