బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే సురేందర్

ఎల్లారెడ్డి 09 అక్టోబర్ జనం సాక్షి  మండలం లోని సోమార్పేట్ గ్రామానికి చెందిన బిట్ల సంగయ్య ఇటీవల అనారోగ్యం తో మృతి చెందిన విషయం తెలుసుకున్న  శాసన సభ్యులు సురేందర్  ఆదివారం  సొమర్ పెట్ గ్రామనికి చేరుకొని కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు గ్రామ సర్పంచ్ ఇందిరా అంజ గౌడ్ ఉప సర్పంచ్ హన్మత్ రెడ్డి తో మాట్లాడుతూ సీనియర్ బి ఆర్ యస్  నాయకులని  గ్రామ సర్పంచ్ గా రెండు మార్లు  యంపిటిసి గా ఒక్క మారు పార్టీ కి సేవచేస్తు  గ్రామ అభివృద్ధికి పాటు బడ్డారాని ఆయన కొనియాడారు  బిట్ల  సంగయ్య అనారోగ్యంతో చికిత్స పొందుతూ హైదరాబాదులోనీ ఆస్పత్రిలో మృతి చెందడం బాధాకరం అని అన్నారు పార్టీ నుండి అన్ని రకాల సాహాయ      సాహకారాలు చేస్తామని కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పారు ఆయన వెంట పంచాయతీ వార్డ్ మెంబర్ టి ఆర్ యస్ నాయకులు అంజ గౌడ్  పల్దే నారాయణ, ఎల్లారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీష్, టిఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి చింతల శంకర్, కిష్టారెడ్డి, గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు