బాధిత కుటుంబాలను పరామర్శించిన శ్రీ గౌరవ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి

దోమ సెప్టెంబర్ 28(జనం సాక్షి)
వికారాబాద్ జిల్లా దోమ మండలం మోత్కూరు గ్రామంలో ఇటీవల ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన విద్యార్థిని నందిని తల్లిదండ్రులను నర్సమ్మ అంజీలయ్యను పరామర్శించి ఆర్థిక సాయం అందించారు, అలాగే ఫిరంగి భీమమ్మ ప్రమాదవశాత్తు క్రిందపడి కాలుకు గాయమైంది వారిని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు, అలాగే మోత్కూర్ గ్రామంలో టిఆర్ఎస్ కార్యకర్త చింతల ఆనంద్ భార్య అయిన ఉమాదేవి గుండెపోటుతో మరణించింది నేడు వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు అనంతరం నేడు కరోబార్ పుల్ల అంజీలయ్య తల్లి నిన్న సాయంత్రం మరణించింది వారిని కూడా నేడు సాయంత్రం చీకటి అయిన అందరి కుటుంబాలను పరామర్శించి బాధిత కుటుంబాలకు మనోధైర్యాన్ని నింపారు శ్రీ గౌరవ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం,గ్రామ తెరాస నాయకులు మల్లేశం,సుధాకర్,సురేష్,సలీం,నర్సింహులు,రాములు,గ్రామస్థులు వెంబడి ఉన్నారు…