బాబు పర్యటనపై భగ్గుమన్నకరీంనగర్‌

టీడీపీ కార్యాలయానికి నిప్పు
తెలంగాణ విద్యార్థి సంఘం
పేర ఘటనా స్థలంలో లేఖ
కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 21(జనంసాక్షి):
బాబు తెలంగాణ పర్యటనపై కరీంనగర్‌ భగ్గుమంది..తెలంగాణపై తేల్చకుం డా బాబు మహబూబ్‌నగర్‌లో ఎలా అడుగుపెడతరంటూ ఇప్పటికే తెలంగా ణవాదులు ప్రశ్నిస్తుండగా తాజాగా నగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు..బాబు తెలంగాణపై తేల్చాకే ఇక్కడ అడుగుపెట్టాలని డిమాండ్‌ చేస్తూ టీవీఎస్‌ పేరిట లేఖలను ఘటనాస్థలంలో వదిలివెళ్లారు..ఆదివారం అర్దరాత్రి పార్టీ కార్యాలయం నుంచి పొగలు వెలువ డుతుండడంతో చుట్టుపక్కల వారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమా చారం అందించారు.
దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు టీవీ ఎస్‌ పేరిట ఉన్న లేఖని స్వాధీనం చేశారు. ఘటనలో ఫర్నిచర్‌ దగ్దం అయింది. అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేశారు.