బిజెపి సభ విజయవంతంపై హర్షం

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు, విజయ సంకల్ప సభను విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ను పీర్జాదిగూడ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నమిలికొండ అనిల్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూరపాటి విజయకుమార్, బోడుప్పల్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్ కలిసి అభినందించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జంట మున్సిపల్ కార్పొరేషన్ల అధ్యక్షులు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుందని తెలియజేశారు. పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు.