బి.ఆర్.ఎస్(టి ఆర్ ఎస్) పార్టీలో చేరికలు

యువత బి ఆర్ ఎస్ పార్టీ వెంటే..
వేల్పూర్ ,అక్టోబర్ 09(జనంసాక్షి):
కెసిఆర్ గారి జనరంజక పాలన , సంక్షేమ కార్యక్రమాలు మరియు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కమ్మర్పల్లి మండలము బషీరాబాద్ గ్రామానికి చెందిన యువజన నాయకుడు రఘు గౌడ్ మరియు అతని ఆధ్వర్యంలో వివిధ యువజన సంఘాల సభ్యులు సుమారు 50 మంది ఈ రోజు వేల్పూర్ లోని  నివాసంలో వేముల  ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.పార్టీలో చేరిన వారిలో త్రీడి యూత్,డ్రాగన్ యూత్,రోలింగ్ లయన్స్,గరుడ యూత్ యువజన సభ్యులు కలరు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో బిజెపి పరిపాలనలో పరిస్థితులు రోజు రోజుకు దిగజరుతున్నాయని,పేద ప్రజలను కొట్టి పెద్ద గద్దలకు డబ్బులు లక్షల కోట్లు ప్రధాని మోడీ అమిత్ షాలు పంచిపెడుతున్నారని అన్నారు.
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం కల్పించక పోగా ఉన్నవి ఊడగొడుతున్నది కేంద్ర ప్రభుత్వం అని అన్నారు..
అన్ని అవగతమౌతున్న  యువత రాష్ట్రంలో మరియు దేశంలో KCR నాయకత్వంలో BRS పార్టీ అవసరాన్ని గుర్తించి యువత BRS పార్టీలో చేరుతున్నారు అని అన్నారు..
తెలంగాణ లో అన్ని రంగాల్లో అన్ని వర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలని బి ఆర్ ఎస్  పార్టీ కి యువత మద్దతు తెలుపుతుంది అని మంత్రి అన్నారు… ఈ కార్యక్రమంలో స్థానిక మండల ,గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Attachments area