బీఆర్‌ఎస్‌ అంటే భూకబ్జాలే..

` తెలంగాణలో గెలిస్తే ఉచిత అయోధ్య దర్శన్‌
` జగిత్యాల, జనగామ సభల్యలో అమిత్‌ షా ప్రచారం
జనగామ/జగిత్యాల(జనంసాక్షి):తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే డిసెంబర్‌ 3న మరోసారి దీపావళి జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. జనవరిలో అయోధ్య రామ మందిరం ప్రారంభం అయ్యే సమయంలో మూడోసారి దీపావళి వస్తుందని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్‌ పల్లిలో తెలంగాణ బీజేపీ నిర్వహించిన బహిరంగ సభకు అమిత్‌ షా హాజరై మాట్లాడారు. అంతకుముందు జనగామ జిల్లా కేంద్రంలో కూడా అమిత్‌ షా మాట్లాడారు. స్థానిక ప్రెస్టన్‌ మైదానంలో జరిగిన సభలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్‌ షా మాట్లాడుతూ.. అసదుద్దీన్‌ ఓవైసీ, ఇతర నాయకులకు భయపడి కేసీఆర్‌ సెప్టెంబర్‌ 17 విమోచన దినోత్సవాన్ని విస్మరించారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి చూపిస్తామని చెప్పారు. బైరాన్‌ పల్లిలో రజాకార్ల చేతిలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నామని చెప్పారు. అక్కడ అమరుల కోసం స్మారక స్థూపాన్ని నిర్మిస్తామని చెప్పారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ జనగామకు ఇచ్చిన పాలిటెక్నిక్‌ కాలేజీ హావిూ నెరవేరనేలేదని అన్నారు. అప్పుడు ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, ఇప్పుడు వచ్చిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూ కబ్జాలకు పాల్పడే వాళ్లేనని అమిత్‌ షా విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే ఉచితంగా అయోధ్య యాత్ర చూపిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హావిూ ఇచ్చారు. జనగామలో జరిగిన ఎన్నికల ప్రచారంలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు. ‘అయోధ్య రామ మందిరం జనవరిలో ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. బీజేపీని గెలిపిస్తే ఉచితంగా అయోధ్య యాత్ర చేపిస్తాం. తెలంగాణలో బీజేపీ వస్తే అవినీతికి పాల్పడిన అందరినీ జైలుకు పంపుతాం. పార్లమెంట్‌ నిర్మించిన మోదీ దేశ గర్వాన్ని పెంచిన నాయకుడు. ప్రధాని మోదీ కృషితో చంద్రయాన్‌ ముద్దాడిన ఘనత మనది. మిషన్‌ కాకతీయ అంటేనే కవిూషన్‌. 4 శాతం ముస్లిం రిజర్వేషన్‌ తీసేసి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతాం. 2024లో మరోసారి మోదీని ప్రధానిని చేద్దాం.‘ అని ప్రజలకు అమిత్‌ షా పిలుపునిచ్చారు.

తాజావార్తలు