బీఆర్‌ఎస్‌ చేజారిన నకిరేకల్‌ మున్సిపాలిటీ

నల్లగొండ(జనంసాక్షి):నకిరేకల్‌ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. మున్సిపల్‌ పీఠంపై కాంగ్రెస్‌ పాగ వేసింది. నకిరేకల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ రాచకొండ శ్రీనివాస్‌ గౌడ్‌ పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లు ఉండగా.. వారిలో 16 మంది అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచారు. మిగిలిన నలుగురు సభ్యులు ఈ అవిశ్వాస తీర్మానానికి హాజరు కాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో నకరేకల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని బీఆర్‌ఎస్‌ కోల్పోయింది. దీంతో నకిరేకల్‌ మున్సిపల్‌ పీఠం హస్తం పార్టీకి దక్కుతుంది. ఎమ్మెల్యే వేముల వీరేశం అవిశ్వాసంలో చక్రం తిప్పాడు. త్వరలోనే నకలిరేకల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కొత్త ఛైర్మన్‌ ఎన్నిక కానుంది.