సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని

డిసెంబర్17(జనంసా
ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన సొంత గ్రామం దోమ మండలంలోని శివారెడ్డిపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే మొదటి రెండు దశల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో ఓటమిని ఎదురుచూశారు. అలా తనకు కూడా కావొద్దని అనుకున్నారో ఏమో.. ఏకంగా పోలింగ్ కేంద్రం వద్ద కుర్చి వేసుకుని కూర్చుకున్నారు. ఓటేస్తానికి వెళ్లే వారిని కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే పోలింగ్ కేంద్రం వద్ద కూర్చున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత ఊరిలో ఓడిపోతే పరువుపోతుందనే ఉద్దేశంతోనే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.



