బృహత్‌ పల్లె ప్రకృతి పనులను ప్రారంభించిన వైస్ ఎంపీపీ

రుద్రంగి ఆగస్టు 21 (జనం సాక్షి)
రుద్రంగి మండలం మానాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనం పనులను వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య స్థానిక సర్పంచ్ అల్లూరి మానస తో కలిసి
ప్రారంభించి మొక్కలు నాటారు.ఆదివారం మానాల గ్రామ శివారులోని నీలగిరి చెట్ల వద్ద  పది ఎకరాల్లో ఏర్పాటుచేయనున్న స్థలంలో పనులు ప్రారంభించి ఉపాధిహామీ కూలీలతో మొక్కలు నాటించారు.ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ భూమయ్య మాట్లాడుతూ… హరిత తెలంగాణనే లక్ష్యంగా సీఎం కేసీఆర్  అటవీ సంపదను పెంపొందించేందుకు పల్లె ప్రకృతి వనాలు దోహదపడతాయని ఆన్నారు.