భారత్ జోడో యాత్ర జయప్రదం కావాలని ప్రార్థనలు

టిపిసిసి కార్యదర్శి చేపూర్ వినోద్
స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 10 , ( జనం సాక్షి ) : రాహుల్ గాంధీ నాయకత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర జయప్రదం కావాలని ప్రత్యేక ప్రార్థనలుచేయడం జరిగిందని టిపిసిసి కార్యదర్శి చేపూరి వినోద్ అన్నారు. డివిజన్ కేంద్రంలో ఏర్పా టు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ సంకల్పించిన భారత్ జోడోయాత్ర తెలంగాణలోకి రాబోతున్న సందర్భంగా దేశాన్ని అత్యంత ప్రభావితం చేయగల యాత్ర సఫలం కా వాలని, కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ప్రత్యేకప్రార్థనలు చేసినట్లు ఆయన తెలి పారు. వచ్చే ఎన్నికల్లో అవి నీతి టీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు.ఈకార్యక్రమంలో దైవజనులు ఫెలోషిప్ ఉపాధ్యక్షుడు దేవరం,బాలస్వామి, నిర్మ ల జ్యోతి, యాకూబ్, కె ఆనందం, తామస్ తదిత రులు పాల్గొన్నారు.