భువనగిరిలో సేవాలాల్‌ జయంతి వేడుకలు

యాదాద్రి భువనగిరి,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  భువనగిరిలోని తెలంగాణప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం  వద్ద లాంబడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సంత్‌ శ్రీ సేవాలాల్‌ మహరాజ్‌ 280 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు…ఈకార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గణెళిష్‌ నాయక్‌ జిల్లా అధ్యక్షుడు భూక్య సంతోష్‌ నాయక్‌,రాష్ట్ర కార్యదర్శి దేవసింగ్‌ నాయక్‌,ప్రధాన కార్యదర్శి మెగావత్‌ శేఖర్‌ జిల్లా సభ్యులు  తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు గణెళిష్‌ నాయక్‌ మాట్లాడుతూ సేవాలాల్‌ మాహరాజ్‌ లంబాడీ జాతికి ఎంతో సేవ జాతి ఐక్యతపై అభివ్రుద్ధి పై పోరాటం చేసిన నాయకులు అని కోనియాడారు అలాగే జిల్లా అధ్యక్షుడు భూక్య సంతోష్‌ నాయక్‌ యాదాద్రి భూవనగిరిలో సేవాలాల్‌ మాహరాజ్‌ 10 ఎకరంలో స్థలాన్ని కేటాయించి మందిరం ఎర్పటు చేయాలని లంబాడీ హక్కుల పోరాట సమితి ప్రభూత్వనికి డిమాండ్‌ చెస్తునట్లు తెలిపారు.