భూత్‌పూర్‌లో సడక్‌బంద్‌

భూత్‌పూర్‌: సడక్‌బంద్‌లో భాగంగా మండలంలోని తెరాస నాయకులు పెద్ద యెత్తున రాస్తారోకో చేపట్టారు. డీఎస్పీ మల్లిఖార్జున్‌ ఆధ్వర్యంలో పోలీసులు ఆందోనకారులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నం విఫలం కావడంతో పది నిమిషాలు పాటు నిరసన కార్యక్రమాలకు అనుమతి ఇచ్చారు. అనంతరం అదనపు బలగాలు రప్పించి
వరంగల్‌ వెస్ట్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌, తెరాస పొలిట్‌ బ్యూరో సభ్యుడు ఇబ్రహీంను బలవంతంగా అరెస్టు చేశారు. వీరితో పాటు పీఆర్‌టీయూ (టి) రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్థన్‌రెడ్డి, నిరుద్యోగ సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్‌రెడ్డి, పీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేదకుమార్‌ తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.