మండల వ్యాప్తంగా ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 30:చిగురుమామిడి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు,అభిమానులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.తెరాస మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అధ్వర్యంలో మండల కేంద్రంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు.ఈకార్యక్రమానికి ఎంపీపీ కొత్త వినిత శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎంపీపీ వినిత శ్రీనివాస్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య మాట్లాడుతూ అహర్నిశలు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పని చేస్తూ, ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, శత్రువులకు సైతం మంచి చేసే మనసున్న మహానుభావుడు ఎమ్మెల్యే సతీష్ కుమార్ అని కొనియాడారు. ఆ భగవంతుడి దయవల్ల ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతూ హుస్నాబాద్ నియోజకవర్గానికి మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు. 6000 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి హుస్నాబాద్ ప్రాంత రూపురేఖలను మార్చిన అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే సతీష్ కుమార్ అని, వచ్చే ఎన్నికల్లో ఆయనను మూడోసారి గెలిపించుకోవడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.ఈకార్యక్రమంలో తెరాస జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, పాక్స్ చైర్మన్ జంగా వెంకట రమణ రెడ్డి, వైస్ చైర్మన్ కరివేద మహేందర్ రెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.