మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లో మైనింగ్‌ మాఫియా

రుషికొండ ధ్వంసంపై శాటిలైట్‌ చిత్రాలు ఉన్నాయి
విమర్శలు గుప్పించిన టిడిపినేత పట్టాభి

అమరావతి,జూలై14(జనం సాక్షి): మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనో మైనింగ్‌ మాఫియా నడుస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఆరోపించారు. ఇది కప్పి పుచ్చుకోవడానికే మంత్రి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ భారతీ సిమెంట్స్‌ అక్రమార్జనతోనే లాభాల బాటలో నడుస్తోందన్నారు. రిషికొండ అంశంలో శాటిలైట్‌ ఇమేజెస్‌ కావాలన్నారు.. చంద్రబాబు కు టెక్నాలజీని విూరు నేర్పిస్తారా?.. విూరు అక్రమాలు చేయకముందు.. తర్వాత శాటిలైట్‌ ఇమేజెస్‌ మా దగ్గర ఉన్నాయని పట్టాభి అన్నారు. శాటిలైట్‌ ఇమేజెస్‌ ఆధారంగానే రిషికొండ అక్రమాలపై ఆరోపణలు చేస్తున్నామని పట్టాభి పేర్కొన్నారు. రిషికొండను ఎలా ధ్వంసం చేశారో ఇమేజెస్‌లో స్పష్టంగా ఉందన్నారు. అక్రమ తవ్వకాలతో రిషికొండను పిండి చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. గాలి జనార్ధన్‌?రెడ్డికి పట్టిన గతే పెద్దిరెడ్డికి పడుతుందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమ తవ్వకాలపై చర్యలుంటాయని, అక్రమ తవ్వకాలకు పాల్పడినవారిని జైలుకు పంపిస్తామని పట్టాభి రామ్‌ అన్నారు.